బిహార్ మాజీ సీఎం, జేడీయూ సీనియర్ నేత జగన్నాథ్ మిశ్రా(82) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోచికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. మిశ్రా మూడు సార్లు సీఎంగా పనిచేశారు. బిహార్ రాజకీయాల్లోకి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అడుగుపెట్టడానికి ముందే ఆయన రాష్ట్రంలో ప్రముఖ రాజకీయనేతగా ఉన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరపున చివరి సీఎం గా మిశ్రా పనిచేశారు.
దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన బిహార్ పశుదాణా కుంభకోణంలో జగన్నాథ్ మిశ్రా కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాంచీ కోర్టు ఆయనను ఇటీవల నిర్ధోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖలు తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఆయనకు నివాళిగా బిహార్ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కొలిమిలో యువత భవిష్యత్తు..మోదీ సర్కార్ పై సోనియా ఫైర్