telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దళితుల భూములు లాక్కొంటున్నారు: మంద కృష్ణ

Manda Krishna

అభివృద్ధి కార్యక్రమాల పేరిట దళితుల భూములు లాక్కొంటున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ అన్నారు. మా భూములు మాకు కావాలి’ పేరిట ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సిరిసిల్లలో నిర్వహించిన దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని, ఇప్పుడు డబ్బుల్లేవంటున్నారనిఅన్నారు.

డబ్బు లేకుండా సెక్రటేరియట్ ఎలా కడుతున్నారని మంద కృష్ణ ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యయంలో దళితులు, బహుజనులే త్యాగం చేశారని అన్నారు. కానీ దొరల రాజ్యంలో దళితుల బతుకులు ఛిద్రమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అభివృద్ధి కార్యక్రమాల పేరిట దళితుల భూములు లాగేసుకుంటున్నారని చెప్పారు. శ్మశానవాటికలు, రైతు వేదికలు అంటూ భూములు లాక్కుంటుంటే తట్టుకోలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. గట్టిగా ప్రశ్నించినవారిపై పీడీ యాక్ట్ లు, కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

Related posts