కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు కరోనాబారిన పడ్డారు. ఈ వైరస్తో చాలా మంది ప్రముఖులు కూడా మృతి చెందారు. తాజాగా.. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. “#RTPCR పరీక్షల్లో నాకు #COVID పాజిటివ్ అని తేలింది. దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, కలుసుకోవడాని కీ ప్రయత్నించకండి. నాతో కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవాలని మనవి. హోం ఐసోలాషన్ లో ఉన్నాను. ఆందోళన చెందాల్సిన పని లేదు. మళ్ళీ యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను.” అంటూ మంత్రి అజయ్ కుమార్ పేర్కొన్నారు.
previous post