telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అందుకే రాజధాని వికేంద్రీకరణ అంటున్నారు: అశోక్ బాబు

ashok babu mlc

ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అశోక్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురాలేకపోతున్నారని… అందుకే, రాజధాని వికేంద్రీకరణ అంటున్నారని చెప్పారు.

రాష్ట్రానికి మూడు రాజధానులు అనేది జగన్ ఆలోచన మాత్రమేనని మంత్రులు చెబుతున్నారని అన్నారు. రాజధాని మూడు చోట్ల ఎందుకు? ఐదు చోట్ల పెట్టండి అని ఎద్దేవా చేశారు. మరో టీడీపీ నేత బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ అనాలోచిత ప్రకటనను జగన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts