telugu navyamedia
రాజకీయ

నా స్నేహితుడు కేజ్రీవాల్ కు అభినందనలు..-కమల్ హాసన్

ఇప్పటి వరకూ దేశ రాజధాని ఢిల్లీలో తమ పాలన కొనసాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో రాష్ట్రానికి తన పాలన విస్తరించుకుంది.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో అరవింద్ కేజ్రీవాల్ కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా స్టార్ హీరో , రాజకీయ నాయకుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.

“ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించినందుకు నా స్నేహితుడు అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు… పార్టీ ఆవిర్భవించిన పదేళ్లలోనే మరో రాష్ట్రమైన పంజాబ్‌లో విజయం సాధించడం అభినందనీయం” అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

Related posts