telugu navyamedia
రాజకీయ వార్తలు

కేఏ పాల్ కు మాతృవియోగం!

KA Paul comments Chandrababu

క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి వ్యవస్థాపకులు కేఏ పాల్ తల్లి కిలారి సంతోషమ్మ(78) గత రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 8.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. తల్లి మరణ వార్తను కేఏ పాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఆమె ప్రస్తుతం స్వర్గంలో మరింత మెరుగైన జీవనాన్ని గడిపేందుకు వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభువుతో ఆమె కలిసిపోయిందని చెప్పారు. తనకు సొంత ఇల్లు, సొంత కారు లేకపోయినా ఆమె పేదల కోసం ఆమె నిత్యమూ ప్రార్థించేవారని అన్నారు. ప్రజాశాంతి తరఫున ఎన్నికల్లో నిలబడాలని ఆమె దీవించారని చెప్పారు. ఆమె మృతితో ప్రపంచమంతా సంతాపాన్ని తెలుపుతోందని అన్నారు.

Related posts