telugu navyamedia
సినిమా వార్తలు

ఆ సినిమా ఫ్లాప్ తో అన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది… టైగర్ కామెంట్స్

Tiger-Shroff

ఆ సినిమా ఫ్లాప్ తో అన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది అంటూ బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టైగర్ కి 11 ఏళ్ల సమయంలో ఆయన తల్లి అయేషా ‘బూమ్’ అనే సినిమాను నిర్మించారు. 2003లో వచ్చిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించగా… కత్రినా కైఫ్ అదే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందుకు సినిమా పైరసీకి గురైంది. ఆ తరువాత సినిమా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం డబ్బు కూడా రాలేదు. దీంతో అప్పులు తీర్చడానికి జాకీ ష్రాఫ్ ఇంట్లో సామాన్లు అమ్మేసేవారట. ఈ విషయాన్ని టైగర్ ష్రాఫ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తల్లి తీసిన సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇంట్లో సామాన్లు అమ్మాల్సిన పరిస్థితి కలిగిందని, చివరకు మంచం కూడా లేక నేలపై పడుకోవాల్సి వచ్చిందని, ఆ సమయంలో చాలా బాధ పడినట్లు చెప్పుకొచ్చాడు. 2014లో “హీరోపంతి” సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు టైగర్ ష్రాఫ్. ఆ తర్వాత ‘బాఘి’, ‘బాఘి 2’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన “వార్” చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. .

Related posts