telugu navyamedia
రాజకీయ వార్తలు

జ‌వాన్ల త్యాగ్యాన్ని దేశం ఎప్ప‌టికీ మ‌రిచిపోదు: రాజ్‌నాథ్‌

committee on jamili elections said rajnath singh

 పాకిస్థాన్‌పై జ‌రిగిన కార్గిల్ యుద్ధంలో అమ‌రులైన భార‌తీయ జ‌వాన్ల త్యాగ్యాన్ని దేశం ఎప్ప‌టికీ మ‌రిచిపోద‌ని కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కార్గిల్ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ కార్గిల్‌ విజ‌యం మ‌న ఆత్మ‌గౌర‌వానికేగాక అన్యాయంపై మ‌న పోరాటానికి ప్ర‌తీక అని ఆయ‌న అన్నారు.

భార‌త్ ఒక బాధ్య‌త గ‌ల దేశ‌మ‌ని, బ‌య‌ట ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌బోద‌న్న దివంగ‌త మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయి మాట‌ల‌ను రాజ్‌నాథ్ గుర్తుచేశారు. భార‌త్ త‌న ర‌క్ష‌ణ కోస‌మే యుద్ధం చేస్తుంది త‌ప్ప ఇత‌ర దేశాల భూభాగాన్ని ఆక్ర‌మించ‌డం కోసం కాద‌న్నారు. సైనికులు కుల, మ‌తాల‌కు అతీతంగా దేశం కోసం సేవ చేస్తార‌ని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశ ఐక్య‌త‌ను కాపాడేందుకు ఎలాంటి క‌ఠిన చ‌ర్య‌ల‌కైనా సిద్ధ‌మేన‌ని రాజ్‌నాథ్ అన్నారు.

Related posts