telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తిరుచానూరు : ..అమ్మవారిని దర్శించుకున్న.. జస్టీస్ జితేంద్ర కుమార్ దంపతులు…

justice jitendra kumar visited amma temple

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ జితేంద్ర కుమార్ దంపతులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న తితిదే పాలకమండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి,తిరుపతి జేఈఓ బసంత్ కుమార్, తిరుపతి యస్.పి.గజరాజ్ బూపాల్ ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం వారితో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ద్వజ స్తంభానికి నమస్కరించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం అర్చకులు న్యాయమూర్తి దంపతులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.ఆశీర్వాద మండపం వద్ద తితిదె చైర్మన్ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, డిప్యూటీ ఈఓ జాన్సిరాణి, సూపరింటెండెంట్ కుమార్, ఏవియస్.ఓ నందీశ్వరరావు పాల్గొన్నారు.

Related posts