telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టిఆర్ఎస్ వద్దు..కాంగ్రెస్ ముద్దు : దుబ్బాక ప్రచారంలో ఉత్తమ్

uttam congress mp

దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్బంగా.. ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు సిద్దిపేటకు ఎన్ని కోట్లు తీసుకెళ్ళావు… గజ్వేల్ కి ఎన్ని కోట్లు తీసుకెళ్లారు… మరి దుబ్బాక కు ఎందుకు నిధులు తీసుకు రాలేదు…? అని ప్రశ్నించారు. దుబ్బాకకు రావలసిన పాలిటెక్నిక్ కాలేజీ సిద్దిపేటకు ఎందుకు తీసుకెళ్లారని.. దుబ్బాక వంద పడకల ఆసుపత్రి నిర్మించడానికి ఇంకా ఎన్నో ఏళ్ళు పడుతుందని ఫైర్ అయ్యారు.
దుబ్బాక నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయి..ఈ రోడ్ లను చూసి ఓట్లు వేయండని ప్రజలకు సూచించారు. టిఆర్ఎస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా డౌన్ పాల్ మొదలైందని.. దానికి దుబ్బాక నాంది అవుతుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్., టిఆర్ఎస్ వద్దు.. కాంగ్రెస్ ముద్దు అని పేర్కొన్నారు ఉత్తమ్. దుబ్బాకలో మా సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీ, బిజెపి రెండో స్థానానికి పోటీ పడుతున్నాయని.. ఈ మధ్యకాలంలో హరీష్ భయపడో ఏమో.. ఇప్పుడు అభ్యర్థిని చూసి కాదు నన్ను చూసి ఓటు వేయండి అంటున్నాడని ఎద్దేవా చేసారు. అభ్యర్థిని పనితనం గురించి ఇలా మాట్లాడడం సబబా అని ప్రశ్నించారు. గతంలో చెరుకు ముత్యంరెడ్డి దుబ్బాకను ఎలా అభివృద్ధి చేశారు… అతని తనయుడు శ్రీనివాస్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తే అదే విధంగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు.

Related posts