telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మల్లన్న సాగర్ ప్రాజెక్టు పై కేసీఆర్ సమీక్ష

Woman candidates kcr cabinet Telangana

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఈరోజు మల్లన్నసాగర్ ప్రాజెక్టు పై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ నెల 15న మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కేసు హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు ఇందులో ప్రధానంగా ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడం, వారికి పునరావాసం కల్పించడంపై ఉన్నతాధికారులతో చర్చించారు.

నిర్వాసితులకు యుద్ధప్రాతిపదికన పరిహారం చెల్లించాలని సీఎం ఆదేశించారు.మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఆయా గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి పరిహారం చెల్లించామని అధికారులు సీఎంకు చెప్పారు. దీంతో ఇప్పటివరకూ చెక్కుల పంపిణీ ప్రక్రియ ఎంతవరకూ వచ్చిందనే విషయం పై కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోసీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts