telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాయితేజ్ సినిమాకు భారీ ఆఫర్

SBSB

నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో సాయితేజ్, నభానటేష్ జంటగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం దాదాపు పూర్తయినప్పటికీ, లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని మే ఒకటిన రిలీజ్ చేయాలని మొదట్లో నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. థియేటర్లు మూతబడడం వల్ల విడుదల నిలిచిపోవడంతో, ఇప్పుడీ చిత్ర నిర్మాతలను ఓటీటీ సంస్థలు సంప్రదిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక సంస్థ ఏకంగా 25 కోట్లు ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. నిర్మాత మాత్రం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని తెలుస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో థియేటర్లు బంద్ కావడంతో ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ వేదికగా కొత్త సినిమాలను సరాసరి రిలీజ్ చేసే విధంగా ఆయా చిత్ర నిర్మాతలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ సంస్థల మధ్య పోటీ పెరగడంతో భారీ స్థాయిలో ఆఫర్లు ఇస్తున్నారు.

Related posts