ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా, తమన్నా, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “ఖామోషీ”. ఈనాడు, చీకటి రాజ్యం చిత్రాల దర్శకుడు చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీవైఎక్స్ సంస్థ నిర్మిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో ప్రభాస్ గెస్ట్ గా కనిపిస్తారు. 2017లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. తమన్నా మూగ , చెవిటి యువతిగా కనిపించారు. ప్రభుదేవా ఇందులో సైకో పాత్రను పోషించారు. సమీర్ టాండన్, సత్య మానిక్ అఫ్సర్ సంగీతం అందిస్తున్నారు. సంజయ్ సూరి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 31న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇక ప్రభుదేవా ఈనెలలో రెండు సినిమాలతో సందడి చేయబోతున్నారు. “అభినేత్రి-2” కామెడీ హారర్ జోనర్ కాగా.. `ఖామోషీ` సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో మే 31న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కొసమెరపు ఏంటంటే.. ఈ రెండు చిత్రాల్లో ప్రభుదేవా తమన్నా నటించారు.
మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళను కూడా ఎన్కౌంటర్ చేయాలి… పీకేపై శ్రీరెడ్డి సంచలన పోస్ట్