telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ లో 5000 పరుగులు చేసిన 5వ ఆటగాడిగా గబ్బర్…

ఈ ఏడాది ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్ బ్యాట్స్మాన్ శిఖర్ ధావన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా డిసి తరఫున గత మూడు మ్యాచ్‌లలో గబ్బర్ 69*, 57 మరియు 101* ఇప్పుడు 106* పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 లో 421 పరుగులతో రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు, మొదట పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఇక ఈ దుబాయ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ‌తో జరిగిన మ్యాచ్‌లో డిసి ఓపెనర్ ఐపీఎల్ చరిత్రలో 5000 పరుగులు పూర్తిచేసిన 5 వ ఆటగాడిగా నిలిచాడు ఈ మ్యాచ్‌కు ముందు అతను ఈ మైలురాయికి 62 పరుగులు తక్కువగా ఉన్నాడు. కానీ ఇందులో 106 పరుగులు చేయడంతో ధావన్ 5000 పరుగుల మార్కును దాటిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఈ జాబితాలో 5759 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మాన్ సురేష్ రైనా 5368 పరుగులతో ఉన్నారు. ఆ తర్వాత రోహిత్ శర్మ (5158), డేవిడ్ వార్నర్ (5037) ఈ మైలురాయిని ఈ ఏడాది ఐపీఎల్ లోనే చేరుకోగలిగారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌లో, ధావన్ 58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్‌లతో అజేయంగా 101 పరుగులు చేయడంతో ఐపీఎల్ తొలి సెంచరీ సాధించాడు. ఇక ఈ రోజు అద్భుతమైన సిక్సర్‌తో 5000 పరుగుల మార్కును చేరుకున్నాడు, అతను కొట్టిన ఈ సిక్స్ 81 మీటర్ల దూరం వెళ్ళింది.

Related posts