telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వానికి అర్ధరాత్రి జ్ఞానోదయం: సీపీఐ నేత రామకృష్ణ

ap cpi leader ramakrishna on jagan as cm

ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పునర్నియామకంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీ ప్రభుత్వానికి అర్ధరాత్రి జ్ఞానోదయం కలిగిందని చురకంటించారు. నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా తిరిగి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం హర్షణీయమన్నారు. ఇతర వివాదాస్పద అంశాలకు కూడా వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్వస్తి చెప్పాలని ఆయన హితవు పలికారు. ఇదే స్ఫూర్తితో వైసీపీ సర్కారు మెలగాలని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రజలపై మోపిన అధిక ధరల భారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కోసం భూముల విలువను విపరీతంగా పెంచారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక ధరలను విపరీతంగా పెంచారని ఆయన విమర్శించారు.

Related posts