రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ క్రమంగా కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం హెల్త్ బులిటెన్ను విడుదల చేశారు.‘‘సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. నిన్న ఆయన కాలర్ బోన్కు చేసిన ఆపరేషన్ విజయంతం అయ్యింది.
మొదటిలో ఉన్న దానికంటే వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతానికి ఐసీయూలోనే అతడికి చికిత్స అందిస్తున్నాం’’.. ఇంకా ఆయనను 36 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాల్సి ఉందని, ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా, శుక్రవారం సాయంత్రం సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళుతుండగా రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయిన అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి, కుడి కన్నుపై తీవ్రగాయాలు అయ్యాయి. మెడికవర్లో ప్రాథమికి చికిత్స అనంతరం ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు.
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య కామెంట్స్