telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజ్యసభలో 50 శాతం బీసీలకు అవకాశం: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

ummareddy venkateshwarlu

ఏపీలో నలుగురు రాజ్యసభ సభ్యుల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ తమ అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఏపీ నుంచి మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలకు అవకాశం ఇచ్చారు. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు.

రాజ్యసభలో 50 శాతం మేర బీసీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను బీసీ కోటాలోనే రాజ్యసభకు పంపుతున్నామని చెప్పారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అభ్యర్థన మేరకు పరిమళ్ నత్వానీకి రాష్ట్రం నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించామని వెల్లడించారు.

Related posts