ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చలేదని మండిపడ్డారు. గాల్లో మేడలు కట్టి జనాలను ఏప్రిల్ ఫూల్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్. “గాలి హామీలిచ్చి గద్దెనెక్కిన గాలి మాటల ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి గాల్లో మేడలు కట్టి జనాల్ని ఏప్రిల్ ఫూల్ చేశాడు. పార్టీ పేరులోని యువజన, శ్రామిక, రైతుల్ని వంచించాడు. అవ్వాతాతలకు అన్యాయం చేశాడు. మహిళలకు రక్షణలేకుండా చేశాడు. ప్రత్యేకహోదాని తన కేసుల కోసం తాకట్టుపెట్టాడు. బాబాయ్ హత్యకేసుని నీరుగార్చాడు. సీపీఎస్ రద్దుచేస్తానని ఉద్యోగులకు మాటిచ్చి తప్పాడు. మొత్తంగా ఏపీనే ఏప్రిల్ ఫూల్ని చేశాడు. జనాల్ని తప్పుదారి పట్టించేందుకు కొందరు ఫూల్స్తో తన కులపత్రికలో ఏప్రిల్ ఫూల్ వార్తలు రాయిస్తున్న ఫేక్ సీఎం జగన్ రెడ్డి నాటకపు మోసాలు సినిమా చూడాలని ఉంది..ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నాం మీరూ చూడండి.”అంటూ సీఎం జగన్పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
previous post
next post
ప్రజల తరుపున ప్రశ్నిస్తే కేసులు..టీఆర్ఎస్ పై జగ్గారెడ్డి ఫైర్!