కేరళ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే సీఎఫ్ థామస్ (81) కన్నుమూశారు. తిరువల్లలోని ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గత కొన్ని రోజులుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. 1980 నుండి అసెంబ్లీలో చంగనాస్సేరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2001-2006 పదవీకాలంలో ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు రాజకీయ కార్యకలాపాలను థామస్ ప్రారంభించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరాడు. తరువాత చంగనాస్సేరి టౌన్ (వెస్ట్) మండలం ఉపాధ్యక్షుడయ్యారు. అనంతరం కేరళ కాంగ్రెస్లో చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేరళ కాంగ్రెస్ (ఎం) చైర్మన్, తదితర పదవుల్లో కొనసాగారు.