మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి(77) మృతి పట్ల సంతాపం ప్రకటించారు. రాజకీయ దురంధురుడు, మేధావి, జ్ఞాని అయిన జైపాల్రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపిన ప్రజ్ఞాశాలి జైపాల్రెడ్డి అని కొనియాడారు. చక్కటి వాగ్ధాటి, రాజకీయ పరిజ్ఞానం వల్ల జైపాల్రెడ్డిపై తనకు మరింత గౌరవాన్ని పెంచిందన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతికి తెలిపారు.
సీపీఐ మాజీ జాత్యీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్, జైపాల్ మరణం తనను దిగ్బ్రాంతి కలిగించిందని అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. రాజకీయంగా భిన్న ధృవాలలో ఉన్నా తమ దోస్తాన మాత్రం అలాగే కొనసాగిందని చెప్పారు. ఇద్దరం కలిసి ఉస్మానియా యూనివర్సీటీలో కలిసి చదువుకున్నామని గుర్తుచేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంత్రి పదవులు నిర్వహించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. జైపాల్రెడ్డి గొప్ప ప్రజ్ఞశాలి అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.