telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేరళలో ఆగని ఆందోళనలు.. ఎమ్మెల్యే, ఎంపీ ఇళ్లపై బాంబు దాడులు

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు, దాడులతో కేరళ అట్టుడుకుతోంది. ఇప్పటివరకు పోలీసులు 1800 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. కన్నూర్‌ జిల్లాలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తలాసరీ ప్రాంత ఎమ్మెల్యే, సీపీఎం నాయకుడు ఏఎన్‌ షమీర్‌‌, బీజేపీ ఎంపీ వి మురళీధరన్‌ నివాసాలతో పాటు పలుచోట్ల శుక్రవారం రాత్రి బాంబు దాడులు జరిగాయి. షమీర్ ఇంటిపైకి దుండగులు నాటు బాంబులు విసిరారు. ఇరిట్టి ప్రాంతంలో సీపీఎం కార్యకర్త కత్తిపోట్లకు గురయ్యాడు.

రాష్ట్రంలో దాడులకు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కుట్రలు చేస్తోందని షమీర్‌ ఆరోపించారు. కల్లోల పరిస్ధితులను సృష్టించి హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఆందోళనకారుల దాడుల్లో 99 ఆర్టీసీ బస్సులకు నష్టం వాటిల్లింది. ధ్వంసమైన బస్సులతో ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జనవరి 6న పతాన్‌మత్తిట్టాలో జరగాల్సిన ప్రధాని మోదీ పర్యట వాయిదా పడింది.

Related posts