తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే.. తాజాగా టీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఉద్యోగాల భర్తీపై చర్చకు రాకుండా… ఓ విద్యావేత్తను తిట్టించాడని… దున్నపోతులను దాసోజు మీదకు ఉసిగొల్పాడని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్ది చిన్నారెడ్డి విద్యావేత్త, రాములు నాయక్ సామాజిక వేత్త అని… టీఆర్ఎస్ అభ్యర్థులు విద్యా, వ్యాపారవేత్తలని చురకలు అంటించారు. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే ఉస్మానియా యూనివర్సిటీ కూడా కబ్జా చేస్తారని ఆరోపించారు. దుబ్బాక ఎన్నికల్లో హరీష్ కి సగం చీటీ చినిగిందని.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం చీటీ చింపడానికే బాధ్యతలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఈటల పని అయిపోయింది… ఎన్నికల తర్వాత హరీష్ పని అయిపోతుందని పేర్కొన్నారు. నియమాకలపై ఎవరు చర్చకు వచ్చినా.. మీడియా సమక్షంలో చర్చ కు సిద్ధమని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు ఇచ్చినప్పుడు… చెప్పుకోవడానికి రావడానికి ఏంటి ఇబ్బంది..? అని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఉద్యోగాల గురించి టీఆర్ఎస్ మాట్లాడుతుందని నిప్పులు చెరిగారు.
previous post
next post
షర్మిల వ్యాఖ్యల పై స్పందించిన ఎంపీ అరవింద్…