కష్టాలను గట్టేక్కించాలని మనం గుళ్లు, గోపురాలకు వెళతాం. గుళ్లో ఉన్న దేవుడిని మొక్కి… మన బాధలు చెప్పుకుంటాం. అలాగే.. దేవుడి హుండీలో డబ్బులు లేక కానుకలు వేస్తాం. కొందరు కొబ్బరికాయలు, అర్చన, ప్రదక్షిణలు అంటూ ఎవరికి తోచిన విధంగా వాళ్లు దేవుడిని మొక్కుతారు. అయితే.. మంగళూరులో కొందరు నిందితులు ఏకంగా గుడిలోని హుండీ లో అశ్లీల సందేశాలు రాసిన చీటీలు, కండోమ్స్ వేశారు. ఆ హుండీ లెక్కించే సమయంలో ఆ ఘటన వెలుగుచూసింది. దీంతో ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ దారుణానికి ఒడిగట్టిన నిందితులు అబ్దుల్ రహీం, అబ్దుల్ తాహిర్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు బుధవారం ఎమ్మెకెరె కొరగజ్జ ఆలయంలో ఉండగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. నిందితులు మూడు నెలలుగా పాండేశ్వర, కద్రి, ఉళ్లాల పోలీస్స్టేషన్ పరిధిలోని ఆలయాల్లో ఆకతాయి చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.
ఆధిపత్యం కోసమే “మా” గొడవలు… తమ్మారెడ్డి భరద్వాజ