telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మహారాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు…

court

అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన వాహనం లభ్యమైనప్పట్టి నుంచి మహారాష్ట్రలో హీట్ పెరిగింది.. ఈ కేసులో మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇవ్వగా.. మహా సర్కార్, అనిల్ దేశ్‌ముఖ్‌.. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వ్యక్తులు, నేరం స్వభావం, ఆరోపణల్లో తీవ్రతను బట్టి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది.. ఇది ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయంగా అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు ధర్మాసనం.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో తాము జోస్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఈ వార్త మహారాష్ట్రరలో హల చల్ చేస్తుంది.

Related posts