telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఎవరు” మూవీ చూడడానికి జపాన్ నుంచి వచ్చిందట…!

adivi-sesh

క్ష‌ణం, గూఢచారి వంటి అభిరుచి గల కథాంశాల్నిఎంచుకొని చక్కటి విజయాల్ని అందుకున్న‌ అడవి శేష్ రీసెంట్‌గా మ‌రోసారి థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన “ఎవ‌రు” చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేశాడు. ఈ చిత్రంలో కావాల్సినంత ఉత్కంఠతో పాటు కథలోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. నిజాల్ని తెలుసుకునే ప్రయత్నంలో అబద్దాలు ఎవరిని దోషిగా తేల్చాయన్నది ఆకట్టుకునే అంశంగా మిగిలిపోతుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించింది. ఈ మూవీపై విమ‌ర్శ‌కుల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మ‌న‌ దేశంలోనే కాక విదేశాల‌లోను ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇటీవ‌ల జ‌ప‌నీస్ ఫ్యాన్ రినా టోక్యోలో జ‌ప‌నీస్ డ‌బ్బింగ్ వ‌ర్షన్ చూసింది. ఇండియాలోను సినిమా చూడాల‌ని హైద‌రాబాద్‌కి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఎవ‌రు హీరో అడ‌వి శేష్‌ని క‌లుసుకొని క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. సినిమా త‌న‌కెంతో న‌చ్చింద‌ని చెప్పుకొచ్చింది. ఆయ‌న‌తో కొద్ది సేపు స‌ర‌దా స‌మ‌యం కూడా గడిపింది. జ‌ప‌నీస్ అభిమాని త‌న‌పై చూపించిన ప్రేమ‌ని చిన్న వీడియో ద్వారా షేర్ చేశారు అడివి శేష్. ఇప్పుడు ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Related posts