telugu navyamedia
సినిమా వార్తలు

ఘనంగా ఏఆర్‌ రెహమాన్ కుమార్తె పెళ్ళి..

ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్​ పెద్దమ్మాయి ఖతిజా రెహ్మాన్​ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆడియో ఇంజినీర్‌, పారిశ్రామికవేత్త రియాస్దీన్ షేక్ మహమ్మద్‌తో మే5న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య  ఆమె పెళ్లి ఘ‌నంగా జరిగింది.

రియాస్దీన్  తెల్లటి షేర్వానీలో కనిపించగా, ఖతీజా ప్రింటెడ్ ఆఫ్-వైట్ దుస్తుల్లో ముస్తాబైంది.

చెల్లితో ఖతిజా రెహ్మాన్

నూతన వధువరులతో దిగిన ఫోటోస్‌ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా రేహ్మాన్ షేర్ చేశాడు .దీంతో పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

"ఈ జంటను సర్వశక్తిమంతుడు ఆశ్వీర్వదిస్తాడు" అని వ్యాఖ్య రాసుకొచ్చారు.

నూతన వధువరులు ఖతీజా రెహమాన్‌, రియాస్ధీన్ షేక్‌ మొహమ్మద్‌ ముందు కూర్చొని ఉంటే వెనుక రెహమాన్‌ ఆయన సతీమణి సైబాబాను, మరో కుమార్తె రహీమా , కుమారుడు అమీన్‌ వెనుక నిల్చుకున్నారు.

ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్​ పెద్దమ్మాయి ఖతిజా రెహ్మాన్​ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆడియో ఇంజినీర్‌, పారిశ్రామికవేత్త రియాస్దీన్ షేక్ మహమ్మద్‌ను పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను రెహ్మాన్​ సోషల్​మీడియాలో పోస్ట్​ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కాగా..డిసెంబర్‌ 29న ఖతీజా, రియాస్దీన్‌ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఆ టైమ్‌లో కాబోయే భర్త ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేసింది ఖతీజా రెహమాన్. తన జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు ఇది అంటూ పేర్కొంది.

"ఈ జంటను సర్వశక్తిమంతుడు ఆశ్వీర్వదిస్తాడు" అని వ్యాఖ్య రాసుకొచ్చారు.

రెహమాన్‌ కుమార్తె కూడా తండ్రి లాగానే మంచి సింగర్. 2010లో శంకర్‌- రజనీకాంత్‌ చిత్రం ‘రోబో’లో ‘ఓ మరమనిషి’ పాటను సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆలపించారు. ఓటీటీలో విడుదలైన కృతిసనన్‌ ‘మీమీ’ చిత్రంలో ‘రాక్‌ఏ బై బేబీ’ పాటను పాడారు.

 కొత్త జంటతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ రెహమాన్‌ ఈ కామెంట్స్‌ రాశాడు. ఎంతో శక్తివంతుడైన ఆ దేవుడు తన కుమార్తెను అల్లుడిని ఆశీర్వదించాలని కోరుతున్నాను అని రాశాడు. రెహమాన్‌ కామెంట్స్‌ పై సంగీత కళాకారులు, విధ్వాంసులు, సింగర్స్‌ స్పందించారు.(Photo Credit:Instagram)

Related posts