ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ పెద్దమ్మాయి ఖతిజా రెహ్మాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆడియో ఇంజినీర్, పారిశ్రామికవేత్త రియాస్దీన్ షేక్ మహమ్మద్తో మే5న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఆమె పెళ్లి ఘనంగా జరిగింది.
రియాస్దీన్ తెల్లటి షేర్వానీలో కనిపించగా, ఖతీజా ప్రింటెడ్ ఆఫ్-వైట్ దుస్తుల్లో ముస్తాబైంది.
నూతన వధువరులతో దిగిన ఫోటోస్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా రేహ్మాన్ షేర్ చేశాడు .దీంతో పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
నూతన వధువరులు ఖతీజా రెహమాన్, రియాస్ధీన్ షేక్ మొహమ్మద్ ముందు కూర్చొని ఉంటే వెనుక రెహమాన్ ఆయన సతీమణి సైబాబాను, మరో కుమార్తె రహీమా , కుమారుడు అమీన్ వెనుక నిల్చుకున్నారు.
కాగా..డిసెంబర్ 29న ఖతీజా, రియాస్దీన్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ టైమ్లో కాబోయే భర్త ఫోటోని ఇన్స్టాలో షేర్ చేసింది ఖతీజా రెహమాన్. తన జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు ఇది అంటూ పేర్కొంది.
రెహమాన్ కుమార్తె కూడా తండ్రి లాగానే మంచి సింగర్. 2010లో శంకర్- రజనీకాంత్ చిత్రం ‘రోబో’లో ‘ఓ మరమనిషి’ పాటను సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆలపించారు. ఓటీటీలో విడుదలైన కృతిసనన్ ‘మీమీ’ చిత్రంలో ‘రాక్ఏ బై బేబీ’ పాటను పాడారు.