“మెట్రో కథలు” అనే వెబ్ సిరీస్లో బిగ్ బాస్ బ్యూటీ, హీరోయిన్ నందినీ రాయ్ వేశ్యగా సంచలన పాత్ర పోషించింది. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్లో తిరువీర్, రాజీవ్ కనకాల ముఖ్యపాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ఈ వెబ్ సిరీస్ టీజర్ నెట్టింట సంచలనంగా మారింది. ఈ టీజర్లో బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది నందినీ రాయ్. ఇందులో నందినీ రాయ్ క్యారెక్టర్ హైలైట్ కానుందని తెలుస్తోంది. 2015 సంవత్సరంలో ‘మోసగాళ్లకు మోసగాడు’లో హీరోయిన్ గా పరిచయమైన నందినీ రాయ్ వెండితెరపై ఆశించిన మేర అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని పాపులారిటీ పెచుకున్న ఈ ముద్దుగుమ్మ దాన్ని కంటిన్యూ చేస్తూ వెబ్ సిరీస్ రూపంలో అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందాల ఆరబోతకు సిద్ధమైంది. మరి ఈ పాత్ర నందినికి ఎలాంటి బ్రేక్ ఇవ్వనుందో చూడాలి.
previous post
next post
శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మాధవిలత