telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరు : “మైండ్ బ్లాక్” సాంగ్ పై ట్రోలింగ్

mass song will be soon said dsp from

మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సీనియర్ నటి విజయశాంతి, భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తుండగా తమ్మిరాజు ఎడిటింగ్ ని అందిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడంతో పాటు సినిమా పై అంచనాలు కూడా పెంచడం జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి “మైండ్ బ్లాక్” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్‌ విన్న ఆడియన్స్‌ పెదవి విరుస్తున్నారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి.. మహేష్ బాబును కొత్తగా ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా మహేష్‌ గతంలో ఎన్నడూ చేయనంత మాస్‌ సాంగ్‌ను ఆడియన్స్‌కు చూపించాలని భావించాడు. అయితే అనిల్‌ ప్రయత్నం బెడిసికొట్టిందనే చెప్పాలి. సోమవారం రిలీజ్ చేసిన మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌ అంచనాలను అందుకోలేకపోయింది. డై హార్డ్‌ ఫ్యాన్స్‌ పాట బాగుందంటున్నా.. సాధారణ శ్రోతలు మాత్రం నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాంగ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ను సోషల్‌ మీడియాలో ఆటాడుకుంటున్నారు నెటిజెన్లు.

Related posts