ఎయిర్లైన్స్ స్పైస్ జెట్ మరోసారి టిక్కెట్ల ధరలను భారీగా తగ్గించింది. అతి తక్కువ ధరల్లో విమాన టికెట్లను ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఈ ఆఫర్లను ప్రకటించింది. దేశీయంగా కిలోమీటర్కు 1.75 చొప్పున, అంతర్జాతీయ కి.మీకు రూ. 2.5 చొప్పున విమాన టికెట్ చార్జీలను వసూలు చేస్తున్నామని స్పైస్జెట్ ఒక ప్రకటన జారీ చేసింది.
ఒకవైపు దేశీయంగా ప్రయాణానికి రూ.899 (అన్నీ కలిపి), అంతర్జాతీయ రూట్లలో రూ.3699 లకు ప్రారంభ ధరగా టికెట్లను అందిస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమైన ఈ సేల్ ఫిబ్రవరి 9తో ముగియనుంది. ఇలా కొనుక్కున్న టికెట్ల ద్వారా సెప్టెంబరు 25, 2019 వరకు ప్రయాణించవచ్చు.
హీరోలు, టెక్నిషియన్ లు పారితోషికం తగ్గించుకోవాలంటున్న దర్శకుడు