దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న ప్రచారంతో ముందుకు వెళ్లాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల కంటే భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకెళ్లేలా విభిన్న మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే ‘నమో’ టీషర్ట్లు, ‘నమో’ కుర్తీలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న కమలం పార్టీ.. ఇప్పుడు ‘నమో’ చీరలతో మహిళలను ఆకట్టుకోవాలని యోచిస్తోంది. సూరత్కు చెందిన ఓ వస్త్ర వ్యాపారికి 5 లక్షల నమో చీరలు కావాలంటూ ఆర్డర్ ఇచ్చింది.
అందమైన ఎంబ్రాయిడరీతో ఆకట్టుకునే మోదీ చిత్రాన్ని ఈ చీరలపై తీర్చిదిద్దారు. మోదీని సింహం, చిరుత పులితో పోలుస్తూ తయారు చేసిన ఈ చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్వచ్ఛభారత్, నోట్ల రద్దుతోపాటు మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను చీరపై ముద్రించారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్, నమో ఎగైన్ మిషన్-2019 నినాదాలను చీరలపై ముద్రించారు. ఈ ప్రచారం ప్రజలలోకి ఎంతవరకు వెళ్తుందో చూద్దాం మరి.
video source : etv
ఆ రోజే క్విట్ బీజేపీ అనే నినాదాన్ని ఇవ్వాలి: సీపీఐ నారాయణ