telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జగన్‌కు పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరికలు…అసెంబ్లీని ముట్టడిస్తాం

pawan

నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే…అసెంబ్లీని ముట్టడిస్తామని పవన్ కళ్యాణ్‌ హెచ్చరించారు. రైతులను ఆదుకోవాలని ఇవాళ మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో DRO వెంకటేశ్వర్లు కు వినతి పత్రం ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నివర్ తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని… ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం తో వ్యవహరిస్తుందని ఫైర్‌ అయ్యారు. రోడ్ల పైకి వచ్చి కూర్చోవడం తనకేమి సరదా కాదని… రైతులు, కౌలు రైతుల కన్నీళ్లు కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయాలలో వినతి పత్రాల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని.. రైతులకు మద్దతుగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే.. అసెంబ్లీని ముట్టడిస్తామని పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు. కాగా… నివార్ తుఫాన్ కారణంగా ఏపీ రైతులకు తీవ్ర నష‌్టం వాటిల్లిన విషయం తెలిసిందే.. దీనిపై ఇప‌్పటికే సీఎం జగన్ పరిహరం ఇస్తామని ప్రకటించారు. 

Related posts