కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా చర్యలను చేపడుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. పలువురు సెలబ్రిటీలు ప్రభుత్వాలకు విరాళాలను అందించడమే కాకుండా నైతికంగా తమ మద్దతుని తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ మోహన్లాల్ కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షల విరాళాన్ని అందచేశారు. ‘అందరం ఎంతో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని తెలిపిన ఆయన ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు తెలిపారు. ఒకరికి ఒకరం అండగా నిలబడాల్సిన సమయమిదని తెలిపారు. ఈ కరోనా బారినుంచి కాపాడేందుకు అవసరమైన వాటి కోసం తన విరాళాన్ని వినియోగించాలని ఆయన కోరారు. అలాగే సూపర్ స్టార్స్ అందరూ కలిసి ఫ్యామిలీ అనే షార్ట్ ఫిల్మ్ చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని సినీ కార్మికుల క్షేమాలకు వినియోగించనున్నారు. ఈ గొప్ప పనిలో తనని భాగం చేసిన బిగ్ బి, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా మరియు కల్యాణ్ జ్యూయలర్స్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
previous post