telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఎన్టీఆర్‌ మూవీలో కియారా..!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారిక హాసిని బ్యానర్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ చిత్రం జూన్ లేదా జూలైలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే త్రివిక్రమ్ సినిమాకుకు షిఫ్ట్ కానున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. అంతేకాదు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక మరో హీరోయిన్‌‌‌గా కియారా అద్వానీని తీసుకోవాలనే యోచనలో ఉన్నాడట త్రివిక్రమ్. ఈ హీరోయిన్‌ ఎన్‌టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో నటించేందుకు ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఇదెంత వరకు నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Related posts