telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్‌ మూవీలో మహేష్‌ హీరోయిన్‌..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్‌’ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనుంది. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ పాత్ర బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ చేయనున్నాడని వార్తలు వినిపించాయి. ఓకే మరి సీతగా ఎవరు కనిపిస్తారని అభిమాను ప్రశ్నించారు. దాంతో ఆగకుండా కొన్ని పుకార్లను పుట్టించారు. సీత పాత్రకు ఇప్పటికే కొందరు హారోయిన్ల పేర్లు చర్చలో ఉన్నాయి. అందరిని పరిశాలించిన ఓం రౌత్ కృతి సనన్‌ను ఎంపిక చేశారని కథనాలోచ్చాయి. తెలుగు ప్రేక్షకులకు కృతి కొత్త ముఖం ఏమీ కాదు. ఇప్పటికీ తెలుగులో మహేష్ సినిమా 1నేనొక్కడినే, నాగచైతన్య దోచేయ్ చిత్రాల్లో చేసింది. ఇప్పుడు ప్రభాస్ సరసన చేసేందుకు ఆఫర్ దక్కించుకుంటుందరన్న వార్త అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Related posts