telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: హోంమంత్రి సుచరిత

ap minister sucharita on fluds

ఫిర్యాదు అందగానే పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఏపీ హోంమంత్రి సుచరిత ఆదేశించారు. గుంటూరులోని నగరంపాలెం మహిళా పోలీస్ స్టేషన్ ను ఆమె అకస్మికంగా సందర్శించారు. స్టేషన్ లో తనిఖీలు నిర్వహించడంతో పాటు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇకపై మహిళా పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసులనే నియమించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేయగా సంబంధింత పోలీసు అధికారిపై హోంమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇకపై మహిళా పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసులనే నియమించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఫిర్యాదు చేసేందుకు వచ్చే బాధితుల పట్ల పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.

Related posts