telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వ్యాపార వార్తలు

పది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు .. అదనంగా ఏసీ కోచ్‌.. : ద.మ.రైల్వే

additional ac coach for 10 expresses

పది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో శాశ్వతంగా ఏసీ త్రీటైర్‌ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నారాయణాద్రి, వెంకటాద్రి, సింహపురి, గౌతమి, దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లల్లో అదనంగా ఒక కోచ్‌ను ఏసీ త్రీటైర్‌గా మార్చనున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఈ రైళ్లలో ఏసీ టూటైర్‌, త్రీ టైర్‌ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి.

పెరుగుతున్న ప్రయాణికులకు మరింత సేవలందించేందుకు వీలుగా పైన పేర్కొన్న ప్రతిరైలులో అదనంగా ఒక ఏసీ కోచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్‌ 1 నుంచి వీటి సేవలు అందుబాటులోకి రానున్నాయి అని తెలిపారు.

Related posts