telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నాకు కరోనా రాలేదు : అంజలి

ఇటీవల పలువురు సినీ తారలు వరుసగా కరోనా బారినపడడం తెలిసిందే. తెలుగు చిత్రసీమ నుంచి ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్ సహా పలువురు సినీ ప్రముఖులకు కరోనా సోకగా.. ఇటీవలే ‘వకీల్ సాబ్’ బ్యూటీ నివేదా థామస్ తనకు కరోనా పాజిటివ్ అని కన్ఫర్మ్ చేసింది. అయితే ఇటీవల జరిగిన ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తళుక్కున మెరిసిన అంజలికి కూడా కరోనా సోకిందంటూ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ ఆ వార్తల్లో నిజం లేదని అందాల తార అంజలి వెల్లడించింది. తనకు కరోనా పాజిటివ్ అంటూ కొన్ని వెబ్ సైట్లలో కథనాలు వస్తున్నాయని, అవి తన దృష్టికి వచ్చాయని వివరించింది. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, శ్రేయోభిలాషులు, స్నేహితులు, అభిమానులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. తనకు కరోనా లేదని సంతోషంగా చెబుతున్నానని అంజలి పేర్కొంది. అయితే అంజలి నటించిన వకీల్ సాబ్ సినిమా రేపు థియేటర్లలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

Related posts