ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ సోదరుడు అస్లాంఖాన్ శుక్రవారం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు కరోనా సోకడంతో పాటు ఇంతకుముందే ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో పరిస్థితి విషమించి మరణించారు. గతవారం దిలీప్కుమార్ సోదరులు అస్లాంఖాన్, ఇషాన్ ఖాన్లు కోవిడ్ లక్షణాలతో ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చేరారు. పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ కరోనా ఉన్నట్లు నిర్దారణ కావడంతో వెంటనే కరోనా వార్డుకు తరలించి చికిత్స అందించారు. అయితే అప్పటికే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో పాటు వారి ఆక్సీజన్ లెవల్స్ కూడా 80% కంటే తక్కువగా ఉన్నట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. దీంతో వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించామని, అయితే వయసు పైబడటం, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉండటంతో పరిస్థితి విషమించి అస్లాం ఖాన్ చనిపోయినట్లు వైద్యులు దృవీకరించారు.
previous post
next post