*వివాదంలో నటుడు నరేష్
*మైసూర్లోని ఓ హోటల్లో పవిత్ర అండ్ నరేష్
*రెండ్ హ్యాండాడ్ పట్టుకున్న నరేష్ భార్య
*పవిత్రను చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించిన రమ్య
*రమ్యను చూసి విజిల్ వేసిన నరేష్
నటుడు నరేష్, కన్నడ నటి పవిత్రా లోకేష్ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా గుసగుసలు వినిపించాయి.
తాజాగా వీరిద్దరినీ మై సూర్లోని హున్సూర్ రోడ్డులోని కోరమ్ హోటల గదిలో ఉన్న నరేష్ పవిత్రను రెడ్ హ్యాండెడ్గా ఆయన మూడో భార్య రమ్య రఘుపతి పట్టుకున్నారు.
పవిత్ర – నరేష్ ఒకే హోటల్ గదిలో ఉన్నట్టు రమ్యకు సమాచారం అందడంతో పోలీసులతో కలిసి హోటల్ వద్దకు వెళ్లిన రమ్య ఆందోళనకు దిగారు. అక్కడ వారిని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన రమ్య పవిత్రను చెప్పుతో కొట్టే ప్రయత్నం చేయగా పోలీసులు ఆమెను అడ్డుకున్నాను.
అక్రమ సంబంధాలను మీరు ప్రోత్సహిస్తారా’ అంటూ పోలీసులను నిలదీసింది రమ్య. హోటల్ గదిలోంచి బయటికి వచ్చిన నరేష్, పవిత్ర నేరుగా లిఫ్ట్లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో నరేష్ రమ్యను చూసి విజిల్స్ వేస్తూ బయటకు వెళ్లిపోయాడు.
ఈ సందర్భంగా రమ్య మీడియా ముందుకు వచ్చి వీరిద్దరి రిలేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంచి ప్రెండ్ అని చెప్పుకొన్నాడు..ఫెండ్ అయితే హోటల్ గదిలో ఎలా ఉంటారని ప్రశ్నించారు.
తన భర్తతో తనకు ఇంకా విడాకులు కాలేదని.. మా వ్యవహారంలో కోర్టులో ఉండగానే.. ఆయన ఎలా పవిత్రతో సహజీవనం చేస్తాడని.. రమ్య ప్రశ్నించింది .దీంతో వీరిద్దరి వ్యవహారం రెండు రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారింది.
ఇండస్ట్రీకి బాలకృష్ణ కింగ్ కాదు , కేవలం హీరోనే… నాగబాబు సంచలన వ్యాఖ్యలు