కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ గా సునీల్ రావు పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. కరీంనగర్ కార్పొరేషన్లోని మొత్తం 60 డివిజన్లకుగాను 33 డివిజన్లను గెల్చుకుని టీఆర్ఎస్ ఇక్కడ అధిక్యం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు నిన్న టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
స్వతంత్ర అభ్యర్థుల చేరికతో టీఆర్ఎస్ బలం 40కి చేరింది. భారతీయ జనతా పార్టీ 13 డివిజన్లలో గెలవగా, ఎంఐఎం 6 డివిజన్లు, ఇతరులు 8 డివిజన్లలో గెలిచారు. మూడింట రెండొంతుల మెజార్టీకి చేరుకున్న టీఆర్ఎస్ అధిష్ఠానం మేయర్ పీఠానికి సునీల్రావును ఎంపిక చేయడంతో ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.