telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

థాయిలాండ్ లో రోడ్డు ప్రమాదం.. ఇండియన్ టెక్కీ దుర్మరణం

Accident

థాయిలాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రగ్న (29) దుర్మరణం చెందారు. బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్నా ఆమె… హాంగ్ కాంగ్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఫుకెట్ లో నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆమె మృతదేహం థాయిలాండ్ లోని ఓ ఆసుపత్రి మార్చురీలో ఉంది. పగ్న కుటుంబం మధ్యప్రదేశ్ ఛత్తార్ పూర్ జిల్లాలో ఉంటోంది.

ప్రగ్న మరణించిన విషయాన్ని బెంగళూరులో ఉన్న ఆమె రూమ్మేట్ కు థాయిలాండ్ అధికారులు తెలియజేశారు. ఈ విషయాన్ని ఆమె రూమ్మేట్ ప్రగ్న కుటుంబసభ్యులకు తెలిపారు. తమ కూతురు చనిపోయిందన్న వార్తతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మరోవైపు ఆమె తల్లిదండ్రులకు థాయిలాండ్ వెళ్లడానికి పాస్ పోర్టు కూడా లేకపోవడం కలచివేస్తోంది.

ప్రగ్న మరణ వార్తను తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అలోక్ చతుర్వేది… ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి కమల్ నాథ్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, ఆమె కుటుంబసభ్యులను కలుసుకున్నారు. బ్యాంకాంగ్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా ప్రగ్న కుటుంబీకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, థాయిలాండ్ లో ఉన్న మన ఎంబసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు.

Related posts