telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజ్‌భవన్‌లో 15 మందికి కరోనా..అప్రమత్తమైన అధికారులు!

Rajbhavan ap

ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌లో మరోసారి కరోనా కలకలం రేగింది. ఇక్కడ పనిచేస్తున్న 15 మంది భద్రతా సిబ్బందికి కరోనా సోకింది.

విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ పనిచేస్తున్న మొత్తం 72 మంది భద్రతా సిబ్బందిని ఒకేసారి మార్చారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. రాజ్‌భవన్‌ను శానిటైజ్ చేశారు. గతంలోనూ ఇక్కడ పనిచేసే పలువురు అధికారులు, సిబ్బంది కరోనా బారినపడ్డారు.

Related posts