కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఇంజినీరింగ్ కృషి అభినందనీయమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీలో 34వ భారతీయ ఇంజినీరింగ్ కాంగ్రెస్ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తో పాటు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పేదల బతుకులు మార్చేందుకు సాంకేతికత ఉపయోగపడాలన్నారు. కృత్రిమ మేధతో ఇంజినీర్లు తమ పనితీరుకు పదునుపెట్టాలని అన్నారు. ఇంజినీరింగ్ కృషి దేశాభివృద్ధికి దోహదపడాలన్నారు. పర్యావరణాన్ని పాడు చేయకుండా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
ప్రతిపక్షంలో ఉండీ అధికారులను బెదిరిస్తున్నారు: మంత్రి అనిల్