telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

“కాళేశ్వరం” ఇంజినీరింగ్‌ కృషి అభినందనీయం: గవర్నర్‌

Tamilisai Soundararajan governor

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఇంజినీరింగ్‌ కృషి అభినందనీయమని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ అన్నారు. హైదరాబాద్ నగరంలోని హెచ్‌ఐసీసీలో 34వ భారతీయ ఇంజినీరింగ్‌ కాంగ్రెస్‌ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ తో పాటు తెలంగాణ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. పేదల బతుకులు మార్చేందుకు సాంకేతికత ఉపయోగపడాలన్నారు. కృత్రిమ మేధతో ఇంజినీర్లు తమ పనితీరుకు పదునుపెట్టాలని అన్నారు. ఇంజినీరింగ్‌ కృషి దేశాభివృద్ధికి దోహదపడాలన్నారు. పర్యావరణాన్ని పాడు చేయకుండా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

Related posts