telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

వివిధ ఉద్యోగ ప్రకటనలు.. అర్హులు దరఖాస్తు చేసుకోగలరు..

govt jobs notifications by ssc and

సి.ఐ.ఎస్.ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ) ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి ముఖ్యమైన విధి ప్రభుత్వానికి చెందిన పారిశ్రామిక ఆస్తులకి రక్షణ కల్పించడం, అదేవిధంగా విమానశ్రయం , మెట్రో రైలు సేవలలో భద్రత కల్పించడం. డిగ్రీ అర్హతతో విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ పోస్తులని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అర్హులైన అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలోకి వెళ్తే..

పోస్టుల వివరాలు..

అసిస్టెంట్ కమాండెంట్

అర్హత : గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.

వయసు : 35 ఏళ్ళు మించి ఉండకూడదు.

ఎంపిక విధానం : రాతపరీక్ష, పిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్.

దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు చివరితేదీ : 24 -12 -2019

మరిన్ని వివరాలకోసం : https://upsconline.nic.in/
———————————————————————————
నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్-రీసెర్చ్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు సిద్దమయ్యింది. ఈ క్రమంలో మొత్తం 95 ఖాళీలన ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని ప్రకటించింది. ఈ పోస్టులకు రెండు నోటిఫికేషన్లను వేర్వేరుగా విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.neeri.res.in ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 23న ప్రారంభం కానుంది.

మొత్తం ఖాళీలు- 95

దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 31

విద్యార్హత- బీఎస్సీ లేదా ఎంఎస్సీ

వయస్సు- 28 నుంచి 30 ఏళ్లు

దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఐడీ: [email protected]

Related posts