telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అడవి శేష్ ”మేజర్” టీజర్ వచ్చేసింది…

తెలుగు చిత్ర సీమలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటులలో అడవి శేష్ కూడా ఒకడనడంలో సందేహం అక్కర్లేదు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరిస్తుంటాడు. అలాంటి అడవి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ కనిపించనున్నాడు. ఈ సినిమా నిజ జీవితం ఆధారంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం కొన్ని సంవత్సారల పాటు శేష్ శ్రమించాడు. అయితే ఉగాది కానుకగా ఈరోజు ఈ సినోమా టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. అయితే ఈ సినిమా కోసం శేష్ ఎంతగానో కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో ఉన్ని కృష్ణన్‌లా ఉండాలని అతడిని అర్థం చేసుకుంటూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మహేష బాబు బ్యానర్‌లో నిర్మితమవుతోంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ వారు అంతర్జాతీయంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా శశి కిరన్ దర్శకత్వంలో తెరకెక్కతోంది. మరి ఈ సినిమా ఎంతవరకు విజయం సాధింస్తుందో వేచి చూడాలి.

Related posts