telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐసీపీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌కు ఫైనల్‌కు కివీస్‌…

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు న్యూజిలాండ్ అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా పర్యటనను… ఆస్ట్రేలియా వాయిదా వేసుకోవడంతో కివీస్‌కు లైన్‌ క్లియర్ అయ్యింది. ఇక ఫైనల్ చేరుకోవడానికి భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు పోటీ పడుతున్నాయి. కరోనా కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా దూరం కావడంతో కివీస్‌ తుదిపోరుకు చేరింది. ఈ విషయాన్ని ఐసీసీ ట్విటర్‌ వేదికగా తెలిపింది. లార్డ్స్‌ మైదానంలో జరగనున్న టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు కివీస్‌ బెర్తు సాధించిందని వెల్లడించింది. అయితే కివీస్‌ ప్రత్యర్థి స్థానం కోసం భారత్‌, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు పోటీ పడుతునున్నాయి. శుక్రవారం నుంచి భారత్, ఇంగ్లండ్‌ మధ్య ప్రారంభం కానున్న నాలుగు టెస్టుల సిరీస్‌ ఫలితంతో తుదిపోరుకు చేరే మరో జట్టు ఎవరనేది తేలనుంది. టీమిండియా అర్హత సాధించాలంటే ఇంగ్లాండ్‌పై 2-0, 2-1, 3-0, 3-1 లేదా 4-0 తేడాతో విజయం సాధించాలి. అదే ఫైనల్‌కు ఇంగ్లాండ్ చేరాలంటే… భారత్‌పై 3-0, 3-1 లేదా 4-0 తేడాతో గెలవాలి. చూడాలి మరి ఈ ఇంగ్లాండ్ సిరీస్ లో భారత్ ఏం చేస్తుంది అనేది.

Related posts