telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్‌లో 91 లక్షలు దాటిన కరోనా కేసులు..

corona vaccine covid-19

దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 91 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 37,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 480 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 48,493 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91,77,841 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 4,38,667 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 86,04,955 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,34,218 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 93.67 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 4. 86 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.47 శాతానికి మరణాల రేటు తగ్గింది. ఇటు దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజు నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 9,90,022 కు చేరింది.

Related posts