నేడు రంజాన్ సందర్భంగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు మిరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్ట్యాంక్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు.
* మిరాలం ఈద్గా ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలను పురానపూల్, కామాటిపుర, కిషన్బాగ్, బహుదూర్పురా ఎక్స్ రోడ్స్ నుంచి అనుమతిస్తారు. ఈ సమయంలో సాధారణ వాహనదారులకు బహుదూర్పురా ఎక్స్ రోడ్స్ నుంచి ఈద్గా వైపు రూట్లలో అనుమతి ఉండదు. ఈ వాహనాలను బహుదూర్పురా క్రాస్ రోడ్డు వద్ద కిషన్బాగ్, కామాటిపుర వైపు మళ్లిస్తారు. ఇక్కడికి వచ్చే వాహనాలకు జూ పార్కు వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
* శివరాంపల్లి, దానమ్మ హాట్స్ నుంచి ఈద్గా వైపు వచ్చే వాహనాలను దానమ్మ హాట్స్ చౌరస్తా నుంచి అనుమతిస్తారు. ఈ సమయంలో సాధారణ వాహనదారులకు ఈద్గా వైపు అనుమతి ఉండదు. దానమ్మ ఎక్స్ రోడ్స్ నుంచి శాస్త్రీపురం, ఎన్ఎస్కుంట వైపు వెళ్లాలి. ఈ వాహనాలకు యూసుఫ్ పార్కింగ్, మజార్ పార్కింగ్, జయేష్ పార్కింగ్, మోడ్రన్ సా మిల్ పార్కింగ్ సమీపంలో, మిర్ అలాం ఫిల్డర్ బెడ్, యాదవ్ పార్కింగ్లో వాహనాలు పార్కు చేసుకోవాలి.
* కాలపత్తార్ వైపు నుంచి ఈద్గాకు వెళ్లే వాహనాలను కాలపత్తార్ లా అండ్ ఆర్డర్ పోలీస్స్టేషన్ నుంచి వెళ్లాలి. సాధారణ వాహనాలను మెచీ కాలనీ, బహుదూర్పురా, శంషీర్గంజ్, ఎన్కే కుంటవైపు వెళ్లాలి. ఈ వాహనాలకు బయ్యా పార్కింగ్, మోడ్రన్ పెట్రోల్ బంక్, బీఎన్కే కాలనీలో పార్కు చేసుకోవాలి.
* ప్రార్థనలు జరిగే సమయంలో పురానపూల్ నుంచి బహుదుర్పురా వైపు వచ్చే వాహనాలను జియాగూడ, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు.
* శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి నుంచి బహుదూర్పుర వైపు వెళ్లే భారీ వాహనాలను అరంఘర్ చౌరస్తా వద్ద మళ్లిస్తారు.
* మోహిదీపట్నం, బంజారాహిల్స్ వైపు నుంచి మాస్బ్ట్యాంక్కు వెళ్లే వాహనాలను మాసబ్ట్యాంక్ ఫ్లై ఓవర్ వద్ద అయోధ్య జంక్షన్, ఖైరతాబాద్, తాజ్హోటల్ వైపు మళ్లిస్తారు.
* రోడ్డు నెం.12 నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను 1/12 జంక్షన్ వద్ద ఖైరతాబాద్, పంజాగుట్ట వైపు మళ్లిస్తారు.
* లక్డీకపూల్ నుంచి మాసబ్ట్యాంక్ మీదుగా 1/12 జంక్షన్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను అయోధ్య జంక్షన్ వద్ద ఖైరతాబాద్ వైపు మళ్లిస్తారు.
* 1/12 నుంచి మాసబ్ట్యాంక్ వైపు వెళ్లే సాధారణ వాహనాలను చింతల్బస్తీ రోడ్డులోకి మళ్లిస్తారు.