telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

గాయాలతో రోడ్డు పై పడి..విద్యార్థి అనుమానాస్పద మృతి

Crime

హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వరంగల్ రహదారిపై గాయాలతో పడి ఉన్న విద్యార్థి షేక్ ఇమ్రాన్‌ను సోమవారం రాత్రి గుర్తించిన స్థానికులు వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నిన్న సాయంత్రం మృతి చెందాడు.

తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసినట్టు చికిత్స పొందుతున్న సమయంలో పోలీసులకు ఇమ్రాన్ తెలిపాడు. మహబూబాబాద్ జిల్లా కు చెందిన ఇమ్రాన్ బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ హయత్‌నగర్‌లోని ఓ కాలేజీలో చదువుకుంటున్నాడు. ఇమ్రాన్ మృతి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts