33 ఏళ్ల కిందట దూరదర్శన్ విశేష ప్రజాదరణ పొందిన రామాయణం, మహాభారతం సీరియళ్లు కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో మరోసారి బుల్లితెరపై ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు దూరదర్శన్లో ప్రసారమైన రామాయణం ప్రస్తుతం దంగల్ అనే ఛానల్లో ప్రసారమవుతోంది. తాజాగా బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అందించిన నివేదిక ప్రకారం టెలివిజన్లో ఎక్కువ మంది తిలకించే కార్యక్రమాల్లో రామాయణం మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు భారతీయ ప్రేక్షకులు టీవీల్లో ఏయే కార్యక్రమాలను ఎక్కువగా వీక్షించారనే దానిపై బార్క్ ఒక నివేదిక విడుదల చేసింది. దీని ఆధారంగా టీఆర్పీల పరంగా రామాయణం ఇప్పటికీ టాప్ రేటింగ్లో దూసుకుపోతుందని పేర్కొంది. జీ టీవీలో వస్తున్న శ్రద్ధా ఆర్య, ధీరజ్ ధూపర్ నటించిన కుండలి భాగ్య సీరియల్ రెండో స్థానంలో ఉంది. అలాగే మహిమా శానిదేవ్ కీ మూడవ స్థానంలో కొనసాగుతంది. దూరదర్శలో ప్రసారమవుతోన్న శ్రీ కృష్ణ నాలుగో స్థానం, స్టార్ ప్లస్లో ప్లే అవుతున్న అనుపమా అయిదో స్థానం దక్కించుకున్నాయి.